ఏలూరు జిల్లా(Eluru District) పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్థి(JanaSena Candidate) చిర్రి బాలరాజు(Chirri Balaraju) నామినేషన్(Nomination) వేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్(Putta Mahesh Yadav) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం నుండి భారీ ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ.. బుట్టాయిగూడెం మండలం కోట రామ చంద్రపురం ఐటీడీఏకు చేరుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి, ఐటీడీఏ పీవో సూర్య తేజకి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం పుట్టా మహేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలని గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.