ఏపీ సీఎం జగన్(CM Jagan) పులివెందుల(Pulivendula) అసెంబ్లీ స్థానానికి నామినేషన్(Nomination) వేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ(Public meeting)లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వైఎస్ఆర్(YSR) వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నామని పరోక్షంగా షర్మిల(Sharmila)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా అన్నారు. వైఎస్ ఆర్ చనిపోయాక ఆయన కుంటుంబం మీద కుట్రలు చేసింది ఎవరూ అని జగన్ ప్రశ్నించారు.
ఇది చదవండి: నేడు పులివెందులలో బీటెక్ రవి నామినేషన్…
వైఎస్ఆర్ అనే పేరు లేకుండా చేయాలని కోరుకుంటున్నది ఎవరు? అని ప్రశ్నించారు. మన శత్రువులతో కలిసి.. వారి పార్టీలో చేరిపోయిన వాళ్లా వైఎస్ ఆర్ వారసులు షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుట్రలో భాగమవుతున్న వీళ్లా వైఎస్ఆర్ వారసులు అని మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరు? అని క్వశ్చన్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
- చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90097