కడప జిల్లా పులివెందుల పరిధిలోని కె. వెలమవారిపల్లె సమీపంలో కోట్లాది రూపాయలు విలువచేసే వందలాది ఎకారాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ భూములను రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 229, 230, 239 లలో ఉన్న భూములను, చెరువులను భూ బకాసురులు కొండలను, చెరువులను ఆక్రమించి చదును చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయంపై విచారణ చేపట్టి బాధ్యులైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలను జిల్లా కలెక్టర్, సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కదిరి రోడ్డులో ఉన్న కంపోస్ట్ యార్డ్ వద్ద ఉన్న కొండపై అక్రమంగా చర్చి నిర్మాణం ఎలా చేపట్టారని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి వెంటనే కలెక్టర్ కు నివేదిక సమర్పించాలని రాంగోపాల్ రెడ్డి సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మెక్సికోలో భారీ భూకంపం.మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
- షార్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
- తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
- కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 214665