తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishen Rao), ప్రణీత్ రావు(Praneet Rao), భుజంగ రావు(Bhujangarao), తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దేశ భద్రతకు సాఫ్ట్ వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)కింద నమోదు చేసే సైబర్ టెర్రరిజం కేసులు ప్రయోగిస్తారు.
ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…
ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని అక్రమంగా చొరబడి తస్కరించిన ఈ నలుగురు నిందితులపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్) కేసులు జోడించేందుకు అనుమతి కోరుతూ పంజాగుట్ట పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నిరూపణ జరిగితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే వీరిపై ఐటీ యాక్ట్ 70 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 70లో 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో…
- ఎన్నికలకు సర్వం సిద్ధం..తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.…
- వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి