Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshVishakapattanam అరకులోయ పట్టణంలో షర్మిల రెడ్డి ఏపీ న్యాయ యాత్ర..

అరకులోయ పట్టణంలో షర్మిల రెడ్డి ఏపీ న్యాయ యాత్ర..

by Rama
YS Sharmila Reddy

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఏస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర లో భాగంగా అరకులోయ పట్టణం చేరుకున్నారు. అరకులోయ ప్రధాన కూడలి వద్ద వై ఎస్ షర్మిల మాట్లాడుతూ ఈ ఐదు ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ ఎమ్మల్యే కానీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ ప్రజలకు ఎం చేశారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు వేగంగా దూసుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యేక డీఎస్సీ అన్నారు. మూడు రాజదానులు అన్నారు, రెండున్నర లక్షల ఉద్యోగుల భర్తీ అన్నారు, పూర్తి మద్యపానం నిషేధం అన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలు జరుపుతుంది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసి భూమ్ బూమ్ బీర్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉన్నాయా ఇదా వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వీళ్ల వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేది అని షర్మిల అన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్క సారి ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున అరకు నియోజక వర్గం అసెంబ్లీ అభ్యర్థిగా శెట్టి గంగాధర్ స్వామి ని ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుండి అప్పలనరసయ్యను ప్రకటించటం జరిగింది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
  • నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.
    నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మామిడి తోటలో ప్రారంభమైన మంటలు క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన…
  • రామచంద్రపురంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం.
    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం నుంచి పసలపూడి జంక్షన్ వరకు…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: