ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఏస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర లో భాగంగా అరకులోయ పట్టణం చేరుకున్నారు. అరకులోయ ప్రధాన కూడలి వద్ద వై ఎస్ షర్మిల మాట్లాడుతూ ఈ ఐదు ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ ఎమ్మల్యే కానీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ ప్రజలకు ఎం చేశారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు వేగంగా దూసుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యేక డీఎస్సీ అన్నారు. మూడు రాజదానులు అన్నారు, రెండున్నర లక్షల ఉద్యోగుల భర్తీ అన్నారు, పూర్తి మద్యపానం నిషేధం అన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలు జరుపుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసి భూమ్ బూమ్ బీర్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉన్నాయా ఇదా వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వీళ్ల వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేది అని షర్మిల అన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్క సారి ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున అరకు నియోజక వర్గం అసెంబ్లీ అభ్యర్థిగా శెట్టి గంగాధర్ స్వామి ని ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుండి అప్పలనరసయ్యను ప్రకటించటం జరిగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
- అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
- ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…





Total views : 199080