ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఏస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర లో భాగంగా అరకులోయ పట్టణం చేరుకున్నారు. అరకులోయ ప్రధాన కూడలి వద్ద వై ఎస్ షర్మిల మాట్లాడుతూ ఈ ఐదు ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ ఎమ్మల్యే కానీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ ప్రజలకు ఎం చేశారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు వేగంగా దూసుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యేక డీఎస్సీ అన్నారు. మూడు రాజదానులు అన్నారు, రెండున్నర లక్షల ఉద్యోగుల భర్తీ అన్నారు, పూర్తి మద్యపానం నిషేధం అన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలు జరుపుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసి భూమ్ బూమ్ బీర్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉన్నాయా ఇదా వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వీళ్ల వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేది అని షర్మిల అన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్క సారి ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున అరకు నియోజక వర్గం అసెంబ్లీ అభ్యర్థిగా శెట్టి గంగాధర్ స్వామి ని ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుండి అప్పలనరసయ్యను ప్రకటించటం జరిగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…





Total views : 79617