Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వం…

ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వం…

by Prakash
Annamaya District

Annamaya District :

ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఫయాజూర్ రహ్మాన్ లు అన్నారు. 2015 లో జరిగిన బక్రీద్ అల్లర్ల కేసును కొట్టి వేసిన సందర్భంగా బాధితులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా సంప్రదాయ కుర్బాన్నిలో భాగంగా జరుపుకునే పండుగ పై కొంత మంది కుట్రలు పన్ని అల్లర్లు జరిగేలా ప్రేరేపించి పైశాచిక ఆనందం పొందారన్నారు. సున్నిత మైన విషయాల పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ లేని వారిపై కేసులు బనాయించడం చాలా బాధాకరం. అటువంటి తరుణంలో ఇంతకాలం తర్వాత పూర్వపరాలో పరిశీలించిన న్యాయస్థానం తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చడం జరిగిందన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అండగా ఉంటూ మత సామరస్యం పెంపొందెలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా నాయకులు కేవలం వరి స్వార్థ రాజకీయాల కోసం అక్రమంగా కేసులు బానాయించడం చాలా దుర్మార్గం అన్నారు. పార్టీలతో సంబంధం అక్రమ కేసును కొట్టి వేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి లకు అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ రెహమాన్, కౌన్సిలర్ అన్నాసలీం బాధితులలో పాటు ఇతర మైనార్టీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాయచోటి ప్రాంతానికి చేనిద్న పలువురు ముస్లిం లకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసిసులతో ఎమ్మెల్యే,ఎంపి ల సహకారంతో ఎమ్మెల్సి, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ లతో పాటు సామన్యాలను సైతం కౌన్సలర్లను చేయడం జరిగిందన్నారు .ముస్లిం అభున్నతి తో పాటు ఈద్ఘా, మసీదులు అభివృద్దికి ప్రభుత్వం నిధులు కుడా కేటాయించడం జరిగిందన్నారు .

Advertisements

You may also like

Our Visitor

013778
Total views : 78076

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.