రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు

Advertisements

<p>ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &&num;8220&semi;ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు&&num;8221&semi; అంటూ నమ్మించి పిలిపించి&comma; కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు&period; మే 4à°µ తేదీన ముంజేటి స్పందన అనే వివాహిత తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది&period; అదే సమయంలో ఇంట్లోని బంగారం&comma; నగదు మాయమవడంతో పోలీసులు మొదట దొంగతనం కోణంలో విచారణ ప్రారంభించారు&period; అయితే&comma; ఘటన జరిగిన రోజు నుంచే ఆమె పదవ తరగతి చదువుతున్న మైనర్ కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది&period; పోలీసుల గాలింపులో సదరు మైనర్ బాలుడు&comma; తన ఇంటర్ స్నేహితుడితో కలిసి పలాస&comma; ముంబై&comma; విశాఖపట్నం&comma; తిరుపతి ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం లభించింది&period; దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి&period; క్రికెట్ గ్రౌండ్‌లో పరిచయమైన స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది&period; తన ప్రేమ వ్యవహారాన్ని తల్లి మందలించి&comma; ఆంక్షలు విధించిందనే కక్షతోనే స్నేహితుడితో కలిసి కన్నతల్లి ప్రాణాలు తీశాడని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.