ఎడారిని తలపిస్తున్న పంట పొలాలు…

Crop fields facing the desert...

Advertisements

&NewLine;<p>బుచ్చినాయుడు కండ్రిగ మండలం పల్లమాల గ్రామపంచాయతీ రెవెన్యూ కి చెందిన పేద రైతుల పొలాలు కాలంగి నది పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో ఈసారి తుఫాను సృష్టించిన బీభత్సానికి దాదాపు 100 ఎకరాలలో ఇసుక మెట్లు ఏర్పడ్డాయి… పంట పొలాలు ఎడారులను తలపిస్తున్నాయి… ఈరోజు వరకు అక్కడికి పోలేని పరిస్థితి రైతులు తమ కుటుంబాన్ని పోషించే&comma; నేలతల్లి కోతకు గురై వాగు వంక లాగా తయారవడంతో వారి ఆవేదన వర్ణనాతీతం&period; ఈసారి భీకరమైన తుఫానుకు అదే సమయంలో కాలంగి నది పొంగిపొర్లడంతో వేల లక్షల టన్నుల ఇసుక గులకరాళ్లు పొలాల వైపుకు దూసుకొచ్చి పంట పొలాలు మాయమై ఇసుక  ఎడారిగా మారిన వైనం&period; 1970 లో అప్పటి ప్రభుత్వం రైతు కూలీలకు పల్లమాల రెవెన్యూలో 220 ఎకరాల సొసైటీ భూమిని సాగు చేసుకోమని ఇవ్వడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక విపత్తుకు గురవుతూ నష్టపోతు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు&period; ఈ రైతులు 50 సంవత్సరాలుగా శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కొసమెరుపు&period; ఏది ఏమైనా వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి &lpar;పల్లమాల&rpar; సర్పంచ్ భర్త అయినా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 220 ఎకరాల సొసైటీ భూమి ప్రక్కనే ఉన్న కాలంగి నది పరివాహక ప్రాంతంలో ఒక కల్వర్టు నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది&period; దీనికి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షలు…&period; ప్రతి సంవత్సరం వీరి నష్టం దీనికి మించి ఉంటుంది వారిచే పరిహారం పంట నష్టానికి మాత్రమే…&period; ఇది పంట నష్టమే కాదు పొలాలలో ఇసుక వచ్చి చేరి తిరిగి పంటకు పొలాన్ని అనువుగా మార్చుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది… ఈ ఖర్చు రైతన్న జీవితాన్ని చిద్రం చేస్తుంది… ఇలాంటి ఘటనలే రైతన్న ఆత్మహత్యలకు కారణమవుతాయి…&period;&period; అధికారులు గుర్తించి వీరి సమస్యకు శాశ్వతం పరిష్కారం చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..