అల్లూరి జిల్లా ఎస్పీ తుసన్ సిన్హా కృషితో ఈనెల ఫిబ్రవరి 6 తారీఖున టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తో మెగా జాబ్ మేళా నిరుద్యోగులైన యువతులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి కొరకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. నిరుద్యోగులైన యువతులు ఆరో తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చింతపల్లి వైటిసి నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని అన్నారు. అర్హులైన యువతలకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం వసతులు కల్పించి సుమారు 20 వేల రూపాయల ఉద్యోగ భద్రత కల్పిస్తారని అన్నారు. ఈ యొక్క ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో యువతలు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
చింతపల్లి లో మెగా జాబ్ మేళా..
367
previous post





Total views : 198629