Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Andhra Pradesh ఎమ్మెల్యేలకు సీట్లు లేవు…ప్రభుత్వానికి ప్రజల్లో ఓట్లు లేవు

ఎమ్మెల్యేలకు సీట్లు లేవు…ప్రభుత్వానికి ప్రజల్లో ఓట్లు లేవు

by Prakash
State BJP leaders Vishnuvardhan Reddy Mahadharna

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల బిల్లులను త్వరగా ఇవ్వాలని బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో మహాధర్మా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న సంవత్సరానికి ఒక మారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాలన వదిలేసి అమరావతి తిరుగుతున్నారని ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే ప్రజలు వారికే పట్టం కడతారు కదా పాలన బాగాలేదని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలకు సీట్లు లేవు, వైసిపి ప్రభుత్వానికి ప్రజల్లో ఓట్లు లేవని ఇక వైసిపి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: