అంధకారంలో మున్సిపల్ కార్యాలయం…

Incident of consuming electricity with the help of generator

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం తమకు చెల్లించాల్సిన బకాయి చెల్లించకపోవడంతో రెండు రోజులుగా కరెంటు సరఫరాను సెస్ అధికారులు నిలిపివేయడంతో జనరేటర్ సాయంతో విద్యుత్ ను వినియోగిస్తున్న సంఘటన జరిగింది&period; గత కొన్ని నెలలుగా సెస్ కు దాదాపు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కమిషనర్ గాని&comma; చైర్ పర్సన్ గాని సరైన సమాధానం ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన సెస్ అధికారులు చేసేదేం లేక మూడు రోజుల క్రితం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు&period; పాలకవర్గం పట్టించుకోకపోవడం&comma; కమిషనర్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సిబ్బంది జనరేటర్ సాయంతో పనులను చేస్తున్నారు&period; రాత్రివేళ మున్సిపల్ కార్యాలయం అంధకారంలో ఉంటుంది&period; వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..