ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తిహార్ జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ (AIIMS Medical Board)స్పష్టం చేసింది. టైప్-2 డయాబెటీస్తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు ఎయిమ్స్ వైద్యులు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించింది. మెడిసిన్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ తెలిపిందని అధికారులు తెలిపారు.
- తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు..ఉత్తరాఖండ్(Uttarakhand) లోని బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం మంచుతో ఈ ఆలయం కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ లలో శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ…
- లోక్సభ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్..!తెలుగు రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ…
- హర్యానాలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానా (Haryana) లోని అధికార బీజేపీ (BJP) ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్సింగ్ సైనీ సారథ్యంలోని ప్రభుత్వం మైనార్టీలో పడింది. సోంబిర్ సంగ్వాన్, రణ్ధీర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.