Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Main News ఆందోళనలో చిరు వ్యాపారులు….

ఆందోళనలో చిరు వ్యాపారులు….

by Prakash
Municipal officials and staff are removing the bins

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల నాగులకుంట సుందరికరణ పనుల్లో భాగంగా కుంట పై కబ్జా చేసిన డబ్బాలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది తొలగిస్తుండగా చిరు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. చిరు వ్యాపారి భోధుల బిక్షపతి మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల నుండి ఇక్కడే డబ్బాలు వేసుకొని జీవనాధారం పొందుతున్నాము. కానీ మాకు ఏటువంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది మా డబ్బాలు తీస్తున్నారని ఉన్నట్టుండి రోడ్డున పడుతున్నాము. గత సంవత్సరం షార్ట్ సర్క్యూట్ తో సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లింది దళిత బందిస్తామన్నారు గాని మాకు ఏ బంధు ఇవ్వలేదు, నాగులకుంట పై గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది కబ్జాలు చేసి గృహ నిర్మాణాలు నిర్మించుకున్నారు. మాతోపాటు వారికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చాలని కోరుతున్నాము. మాకు చిరు వ్యాపారం చేసుకునెలా మున్సిపల్ అధికారులు, చైర్మన్ స్థలం చూపించాలని కోరుతున్నామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039791
Total views : 200839

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: