భారత్ డిజిటల్ హెల్త్ రంగంలో నూతన విప్లవం..

భారత్ డిజిటల్ హెల్త్ రంగంలో నూతన విప్లవం

Advertisements

<p>భారతదేశ డిజిటల్ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో కీలక అడుగు వేసింది&period; దేశవ్యాప్తంగా విడివిడిగా ఉన్న ఆరోగ్య విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ స్వస్థ్ భారత్ పోర్టల్‌ను ప్రారంభించింది&period; ఇది వివిధ ఆరోగ్య కార్యక్రమాలను ఏకీకృతం చేసే వన్-స్టాప్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది&period; ఈ పోర్టల్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ భారం తగ్గడమే కాకుండా&comma; డేటా సేకరణలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది&period;<br &sol;>&NewLine;ఈ సరికొత్త పోర్టల్ ద్వారా డేటా ఎంట్రీ లో డూప్లికేషన్ సమస్య తొలగిపోనుంది&period; ఫలితంగా నివేదికలు త్వరగా అందుతాయి&comma; ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు వేగంగా తీసుకునే వీలుంటుంది&period; ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ పోర్టల్&comma; అభా ఐడీతో అనుసంధానం చేయబడింది&period; దీనివల్ల ఆరోగ్య సమాచార మార్పిడి మరింత సురక్షితంగా మారుతుంది&period; ఈ వ్యవస్థ వల్ల మౌలిక సదుపాయాలపై భారం 20 నుంచి 30 శాతం తగ్గుతుందని&comma; హెచ్‌ఆర్&comma; డేటా ఎంట్రీ పనుల్లో 20 నుంచి 40 శాతం సామర్థ్యం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..