ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర

Advertisements

<p>ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు వచ్చింది&period; అయితే ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరు పత్రం రాలేదు&period; అధికారులను అడిగితే ఎంపీడీఓ లాగిన్ లో పేరు లేదని చెప్పారు&period; అప్లికేషన్ స్టేటస్ మాత్రం కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉన్నట్టుగా కనిపించింది&period;దింతో సదరు లబ్ధిదారులు తమకి ఇంటిని మంజూరు చేయాలని కుటుంబంతో కలిసి బిబిపేట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా బయలుదేరారు&period; జనగామ గ్రామం వద్దకు రాగానే విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ బాధితుల వద్దకు వెళ్లి వారిని కారులో ఎక్కించుకుని ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు&period; అక్కడికక్కడే ఇంటి మంజూరు పత్రం రెడీ చేసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయాలని చెప్పి వెళ్లారని బాధితులు తెలిపారు&period; వెంటనే ఎంపీడీఓ లబ్దిదారురాలికి ఇంటి మంజూరు పత్రం అందజేసి నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.