కలకలం రేపుతున్న పెద్దపులి..

Tiger

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తన్న గూడెం లో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది&period; గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు&period; దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాదముద్రలను సేకరించారు&period; అయితే పాదముద్రలు పరిశీలించగా అవి పెద్దపులి పాదముద్రలుగా అధికారులు ప్రాథమిక నిద్దరణ చేశారు&period; అధికారిక నిర్ధారణ కోసం వైల్డ్ లైఫ్ ల్యాబ్ కి వాటిని పంపించారు&period; అదేవిధంగా దెందులూరు మండలం పేరుగుగూడెంలో మొక్కజొన్న తోటలలో పెద్దపులి పాదముద్రలను గుర్తించి వాటిని సైతం అధికారులు సేకరించారు&period; గత వారం రోజులుగా ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం కొయ్యలగూడెం అదేవిధంగా నల్లజర్ల తాజాగా ద్వారకాతిరుమల దెందులూరు మండలాలలో పులి సంచారంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు&period;&period; పులి ఏ వైపు నుంచి వచ్చి ఎటు దాడి చేస్తుందోనని రాత్రి అయితే ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి&period; అదేవిధంగా బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాలలో తోటలలో పనులుకు సైతం కూలీలు పులి భయంతో వెనుకడుగు వేస్తున్నారు&period; పులిని పట్టుకునేందుకు అది సంచరించిన ప్రదేశాలలో ట్రాప్ కెమెరాలు అమర్చి&comma; దాని కదలికలు గుర్తించి బోన్ల సహాయంతో వాటిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.