ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ…

Theft at Udayakaleswara Swamy Devasthanam

Advertisements

&NewLine;<p>కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది&period; ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు&period; శివాలయం మరియు గంగమ్మ వారి దేవస్థానంలో రెండు హుండీలను పగలగొట్టి నగదు మరియు అమ్మవారి మంగళ సూత్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు&period; వాటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలియజేశారు&period; చోరీ చేసిన హుండీని పక్కనే ఉన్న పొలాల్లో దుండగులు పగలగొట్టి అక్కడే వదిలి వెళ్ళిపోయారు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు&period; ఇదిలా ఉంటే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం వద్ద వాచ్ మెన్ లేకపోవడంతోనే చోరీ జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.