మధ్యంతర బడ్జెట్ పై మోదీ స్పందన ఇదే

Modi

Advertisements

&NewLine;<p>కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది&period; సమ్మిళిత&comma; సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇదని దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు&period; వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత&comma; పేదలు&comma; మహిళలు&comma; రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుందన్నారు&period; 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీ ఇచ్చిందన్నారు&period; ఈ బడ్జెట్ యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబమన్నారు&period; సాంకేతికత రంగంలో పరిశోధన&comma; సృజనాత్మకత కోసం లక్ష కోట్ల నిధి ఏర్పాటుచేశామన్నారు&period; అలాగే బడ్జెట్‌లో చెప్పిన మూలధన వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మోదీ అన్నారు&period; మహిళలను లక్షాధికారుల్ని చేసే &&num;8216&semi;Lakhpati Didis&&num;8217&semi; పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నామని ప్రధాని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.