ఆ రెండు గ్యారంటీలు అమలు లోకి…..

Minister Sridhar Babu

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో చర్చించిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించినట్లు తెలిపారు&period; ఆరు గ్యారంటీల అమలుపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్లు వెల్లడించారు&period; ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలని అభిప్రాయపడ్డారు&period; అందుకే అన్ని అంశాలను తెలపాలని అధికారులను కోరినట్లు తెలిపారు&period; ఆదాయ-వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు&period; ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు&period; సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు&period; అందుకోసం ఈ నెల 9à°µ తేదీన ఆ రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు&period; అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం&comma; రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ&period;10 లక్షలకు పెంపు ఉందని తెలిపారు&period; మిగిలిన నాలుగు గ్యారంటీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు&period; అంతకుముందు తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..