టిటిడి ప్రొసీడింగ్స్ పై జగన్ బొమ్మ దేనికి…?

ttd proceedings

Advertisements

&NewLine;<p>తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై ఒకవైపున టిటిడి ఎంబ్లం తో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ&comma; మరోవైపున జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు&period; టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ లోను రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు&period; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార ఖండూతికి ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించారు&period; ఇప్పటివరకు సైన్ బోర్డులు&comma; వైఎస్ఆర్ కిట్లు&comma; జగనన్న విద్యా దీవెన&comma; జగనన్న పథకాలకు తన ఫోటోను తగిలించి సంబరపడిపోతున్న ముఖ్యమంత్రి ఆఖరుకు తిరుమల వెంకటేశ్వర స్వామి తో సమానంగా తన ఫోటోను ముద్రించి ఇవ్వడం భక్తుల మనోభావాలతో చెలగాట మాడటమేనని ఆయన అన్నారు&period; తక్షణం ప్రొసీడింగ్స్ పై ఫోటోలను తీసి వేయాలని టిటిడి యాజమాన్యానికి ఆయన సూచించారు&period; కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.