Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh నన్నయ వర్సిటీలో మెగా జాబ్ మేళా…

నన్నయ వర్సిటీలో మెగా జాబ్ మేళా…

by Prakash
Mega Job Mela at Nannaya University

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య వర్సిటీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉభయగొదావరి జిల్లాల వైసీపీ యువజన అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ లు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ముందడగు వేస్తున్నామని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. 4 వేలకు పైగా కంపెనీలలో యువతకు ఉద్యోగా అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీలు అయిన మార్పులు, చేర్పులు, రాజకీయ సమీకరణాలు చేస్తారని ఆయన అన్నారు. అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ కూడా సీట్ల వ్యవహారం లో మార్పులు చేస్తున్నారని అన్నారు. 175 స్థానాల్లో 175 ఎమ్మెల్యే లను ఎన్నుకునేందుకు ప్రజలు మరోసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరింత జాగ్రత్తగా గెలుపు గుర్రాలను పెట్టాలని, అక్కడక్కడా చిన్న చిన్న సర్దుబాటులు చేసి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మాకు మెస్సేజ్ ఇస్తూ మార్పులు చేస్తున్నారని అన్నారు . రాజానగరం లో మళ్ళీ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యల కోసం నేను సీఎం కార్యాలయానికి వారానికి రెండు సార్లు వెళ్లానని, అభివృద్ధి చూసి ఎమ్ చేయలో తెలియక, ఎమ్మెల్యే మేము అంటూ కొంతమంది అసలు పెంచుకుంటున్నారని ఆ ఆశలు ఆడియాసలు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొదటి స్థానంలో మొట్టమొదట గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది రాజానగరం మాత్రమే అని ఆశ పడుతున్న కొందరికి చెబుతున్నా అని సీట్ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను, ఆపైనే ఉండే వాటికోసమే నేను ఆలోచిస్తానని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039524
Total views : 197981

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: