Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News సీసీ కెమెరాలను ప్రారంభించిన డీజీపీ…

సీసీ కెమెరాలను ప్రారంభించిన డీజీపీ…

by Prakash
Rajendranagar DCP Jagadishwar Reddy started the CC cameras

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ రష్మీ పేరు మాల్, నార్సింగ్ ఎసిపి లక్ష్మి నారాయణ, శంకర్ పల్లి సిఐ వినాయక్ రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఎక్కడ ఏం జరిగినా మనం ఈజీగా కనిపెట్టవచ్చని దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు శంకరపల్లి లో మొత్తం 102 సీసీ కెమెరాలను ఎర్పాటు చేశామని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి 25 లక్షల రూపాయలు విరాళం అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. సీసీ కెమెరాలను ఎర్పాటు చేసినా వెంబడే ఇద్దరు దొంగలను కూడా గుర్తించినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఈ సంక్రాంతి తర్వాత దాని పునాది స్టోన్ వేసి 2024 సంవత్సరం అయిపోయేసరికి పోలీస్ స్టేషన్ ను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039486
Total views : 197114

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: