Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News ప్రజల వద్దకే ప్రభుత్వం….

ప్రజల వద్దకే ప్రభుత్వం….

by Prakash
Damodara Rajanarsimha

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తులను స్వికరించిన దామోదర రాజనర్సింహ ప్రజల వద్దకు ప్రభుత్వం రావడమే ప్రజాపాలన అని గుర్తు చేశారు. రాయికోడ్ లో 10 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా లబ్ధిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను అధికారులు తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకుల వైఖరి పై ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో అధికారంలో ఉన్నాం కదా అని రాయికోడ్ లో కొందరు వక్స్ భూములను, అసైన్డ్ భూములను కబ్జా చేశారన్నారు. చివరకు ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేసారని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాయికోడ్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రధాన రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ శరత్, ఆర్డీవో, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రిని శాలువాతో సన్మానించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ మాటిచ్చి ఇచ్చిన మాట నియాబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల ముందుకు వచ్చిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని ఆశీర్వదించడం ప్రజల తీర్పుకు కట్టుబడి ఆరు గ్యారెంటీ లను అమలు చేశామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: