సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. రుద్రారంకు చెందిన సాయిబాబాకు ఇస్నాపూర్ పద్మారావు నగర్ లోని శాంతమ్మ కూతురు సత్యవతికి 2021 జనవరిలో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య గొడవలతో భార్య సత్యవతి తన తల్లి శాంతమ్మ వద్దకు వచ్చి ఉంటుంది. భార్య సత్యవతి (22)ని కాపురానికి రానివ్వకుండా అత్త శాంతమ్మ (40) అడ్డు పడుతుందనే ఆగ్రహంతో ఇస్నాపూర్ పద్మారావు కాలనీలో నివాసం ఉంటున్న శాంతమ్మ ఇంటికెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. అక్కడే ఉన్న భార్య సత్యవతి అడ్డుపడడంతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా శాంతమ్మ మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పురుషోత్తం వెల్లడించారు.
అత్తను చంపిన అల్లుడు…
298
previous post





Total views : 80210