సీఎం జగన్ (CM Jagan) :
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ (CM Jagan) పిలుపునిచ్చారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ ప్రసంగించారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని, తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య క్లాస్ వార్ జరుగుతోందన్నారు. తాము గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పశుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు వేసే రెండు ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థులకే వేయాలని సీఎం కోరారు. ఫ్యాన్కు ఓటేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే 3 వేలు పింఛన్ అందుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ దోచుకుంటాయన్నారు. వైసీపీకి ఓటు వేస్తే లంచాలు, వివక్షత లేని పారిపాలన అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…