ఏపీలో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వైసీపీ నేతలు కనుమరుగైపోయారు. ఉన్న పదకొండు మంది ప్రజా ప్రతినిధుల ముఖంలో కళ తప్పింది. ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా.. ప్రవర్తించిన నాయకులంతా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఇక, ఊహించని ఘోర ఓటమిని జీర్ణించుకోలేక జగన్ అసహనానికి గురవుతున్నారు. ఈవీఎంలపై నెపం నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ నాయకుడు రాపాక వరప్రసాద్ మాత్రం ట్యాంపరింగ్ అబద్ధమంటూ జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. జనం ఓటేయకపోతే ఈవీఎంలు ఏం చేస్తాయని రాపాక ప్రశ్నించారుమరోవైపు.. వైఎస్ జగన్ను నమ్మి నిండా మునిగామని ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. కొద్దిరోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని సొంతపార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఇక, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో వైఎస్ జగన్ తడబడ్డారు. తన పేరునే పూర్తిగా చదవలేకపోయారు. ఇక, అసెంబ్లీలో తీవ్ర విచారవదనంలో వైఎస్ జగన్ కనిపించారుఅటు.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రమ్మని మిథున్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేల్చిన ఈ బాంబు వైసీపీ బాక్సు బద్దలు చేస్తోంది. జగన్కు బైబై చెప్పే ఆలోచనలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న వాదనకు బలం చేకూర్చింది. కొంతకాలానికి వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగిలే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 61441