వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగనుంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు,
కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ పసునూరి దయాకర్, తదితరలు హాజరుకానున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి మినహా ఆరు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమవడంతో అంతా ఆశ్చర్యపోయారు. సిట్టింగ్ ఎంపీగా వున్న పసునూరి దయాకర్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ దక్కక పోవచ్చనే ప్రచారం జరుగుతుంది. బిఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉండనున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది.
257
previous post




Total views : 78818