తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవికి ఎంపిక చేసిన నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి అభినందించనట్లు సమాచారం.