ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం మహా జాతర. అందులో జంపన్న వాగుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఉలక్నవరం నుంచి నీళ్లు వదలకపోవడంతో వాగు అంతా బురద మయమైంది. దీంతో భక్తులు బురద నీటిలో స్నానం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే బురద నీటిలో చెప్పులు, ప్లాస్టిక్ కవర్లు, డైపర్స్ ఉండటంతో దుర్గంధం వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రోల్ సభలు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సభల రూపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు…
సీఎం రేవంత్రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్రెడ్డి విదేశీ…