Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshEast Godavari వంగలపూడి గ్రామంలో చేతివాటం చూపించిన గ్రామ వాలంటీర్

వంగలపూడి గ్రామంలో చేతివాటం చూపించిన గ్రామ వాలంటీర్

by Rama
Grama Sachivalayam

వంగలపూడి గ్రామం (Wangalapudi village):

సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో తిగిరిపల్లి మార్తమ్మ అను మహిళ భర్త గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించడంతో ప్రభుత్వం నుండి వచ్చిన 1,08075 రూపాయలు మరియు మట్టి ఖర్చు నిమిత్తం ప్రభుత్వం నుండి వచ్చిన 10వేల రూపాయలను వంగలపూడి గ్రామ సచివాలయం వాలంటీర్ గా పనిచేస్తున్న కోడెల్లి చిన్న రాము అనే యువకుడు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా వంగలపూడి ఇండియన్ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కాజేసాడని తిగిరిపల్లి మార్తమ్మ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బాధిత మహిళ తిగిరిపల్లి మార్తమ్మ డబ్బులు కాజేయడంలో వంగలపూడి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ చింతా శివ ప్రసాద్ పూర్తి సహకారం ఉన్నట్లుగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

వంగలపూడి గ్రామం (Wangalapudi village) లో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న ఈ యువకుడికి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం వంటి ఉపాధిని ఏరకంగా ఇస్తారని గ్రామ పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లపై మండల అధికారి ఎంపీడీవో చర్యలు తీసుకోవలసి ఉన్నా గానీ పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం నుండి నా భర్తకు రావలసిన డబ్బులు పడ్డాయా లేదా అని అడిగినప్పుడల్లా బ్యాంకు ఖాతా నుండి డబ్బులు వాలంటీర్ కాజేసినట్లుగా బ్యాంకు అధికారులు తెలియజేశారని బాధిత మహిళ విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉండగా సీతానగరం పోలీస్ స్టేషన్ నందు భాదిత మహిళ అందజేసిన ఫిర్యాదు పై ఎస్సై టి రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటివి మరలా మరలా పునారావృతం కాకుండా అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టే వారిపై మండల, జిల్లా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని భాదిత మహిళ కుటుంభీకులు కోరుకుంటున్నారు. Read Also..

  • సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
    సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
  • అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
    నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
  • ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039490
Total views : 197136

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: