ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు అరెస్ట్…

Eco Overseas Consultancy

Advertisements

&NewLine;<p>నరసరావుపేట ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమనాథ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు&period; ఈ నెల 16à°¨ చెన్నై యూఎస్ కాన్సులేట్ లో ఇంటర్వ్యూకి హేమనాధ్ హాజరయ్యాడు&period; ధ్రువ పత్రాలను పరిశీలించిన యూఎస్ కాన్సులేట్ అధికారులు …హేమనాధ్ సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీ ధృవపత్రాలుగా గుర్తించి…చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు …యూఎస్ కాన్సులేట్ ఫిర్యాదు చేసింది&period; వెంటనే హేమనాధ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు&period; నరసరావుపేటకి చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు&period; హేమనాధ్ తో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా హరిబాబు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు&period; నర్సారావుపేటలోని ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ లో పోలీసులు తనిఖీలు చేసి కంప్యూటర్&comma; రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు&period; నకిలీ సర్టిఫికెట్లు ఎవరైనా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..