తూర్పు ఆసియా దేశం(Asian Country) తైవాన్(Taiwan) తీవ్ర భూకంపాల(Earthquakes)తో వణికిపోతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల(24 hours) వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించాయి. తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.
ఇది చదవండి: MI vs CSK IPL Match 2024 | ముంబై గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం..
దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్లో ఎక్కువ భూకంపాల కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 3న తైవాన్లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 14 మంది మరణించారు. ఆ నాటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది. భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్కు సమీపంలో తైవాన్ ఉంటుంది. అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అఫ్ఘనిస్థాన్లోఆకస్మిక వరదలతో 300 మంది మృతి..!
- మరోసారి అంతరిక్షయానం చేయనున్న సునీతా విలియమ్స్..
- బ్రిటిష్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి