ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (MLA Prakash Goud) :
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకాశ్ గౌడ్ కలిశారు. తన అనుచరులతో కలిసి ఈ రోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ సమక్షంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోవైపు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో… ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం నెలకొంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు యత్నిస్తున్నారు. అవసరమైతే కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని ఓ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనాలుగణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి…
- సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంసీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం. ఇటీవలే న్యూమోనియాతో బాధపడుతున్న…
- హెచ్ఐసీసీలో గ్లోబల్ ఏఐ సదస్సువిప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్ను విడుదల చేశారు. హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో ఏఐ ఇంటర్నేషనల్ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి…