దేశంలో ఇటీవల ప్రవేశ పెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల(Vande Bharat Railways)కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయనుంది. నగరాల్లో ప్రజారవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్ల(Vande Metro Trains)ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఏడాది జులై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.. అని అధికారి తెలిపారు. వేగంగా వెళ్లగలగడంతోపాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్ లలో ఆగేందుకు వీలవుతుంది. ఈ ఏడాది వందేభారత్ మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వచ్చే రెండు నెలల తర్వాత ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అతిత్వరలో ప్రజలతో పంచుకుంటామని రైల్వే ఉన్నతాధికారి వివరించారు. అలాగే ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. రైల్వే శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వందే మెట్రోలో బోగీల ఏర్పాటు ప్రత్యేకంగా ఉండనుంది. నాలుగేసి కోచ్ లను ఒక యూనిట్ గా పరిగణిస్తారు. కనీసం 12 కోచ్ లతో ఒక వందే మెట్రో ఉండనుంది. ఆయా రూట్లలో డిమాండ్ ను బట్టి కోచ్ ల సంఖ్యను 16కు పెంచుతారు.
- ఎన్నికల వేళ పెరిగిన టికెట్ ధరలు..!ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ…
- సొంతూర్లకు క్యూకట్టిన ఏపీ ప్రజలు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న…
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.