Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh పక్కా ఇళ్ల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేసిన జగన్…

పక్కా ఇళ్ల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేసిన జగన్…

by Prakash
జగన్

ఏడాది కి 5 లక్షల చొప్పున మొత్తం 25లక్షల ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తానని హామీ నిచ్చి సీఎం జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని మాజీ మంత్రి విజయవాడ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉచితంగా ఇవ్వకపోగా గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారని, గృహాలు‌ నిర్మించుకోక పోతే పట్టాలు రద్దు చేస్తామని బెదిరించి పేదల చేత అప్పు చేయించి ఇళ్లు కట్టించి వారికి బిల్లులు చెల్లించక అప్పుల పాలు చేశారని, ఇళ్ల పేరుతో డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి పేరుతో రూ.35 వేలు చొప్పున మొత్తం రూ.3,866 కోట్లు అప్పులు తెచ్చి మహిళల నెత్తిన వేల కోట్లు అప్పులు నెత్తిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్లు అప్పు రెండేళ్లు రుణకాల పరిమితి చెల్లించక పోవడంతో బ్యాంకులు నేరుగా లబ్దిదారులకే నోటీసులు ఇస్తున్నాయని, తెచ్చిన అప్పులు ఏమయ్యాయో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదని, ఓటిఎస్ పేరుతో ఎన్టీఆర్, చంద్రబాబు ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు బలవంతం గా రూ.10వేల నుండి రూ.30వేలు జగన్ రెడ్డి వసూలు చేశారని చెప్పారు. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని చోట్ల సెంటు పట్టా ఇచ్చారు. చంద్రబాబు 2 సెంట్లు ఇస్తే దాన్ని 1 సెంటుకు కుదించారని, రూ.7 వేల కోట్లకు పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు సెంటు పట్టాలో కుంభ కోణం చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

భారతి సిమెంటులో బూడిద కలిపి కట్టిన ఇళ్లు కూలిపోతున్నవి. చంద్రబాబు 5 ఏళ్లల్లో 12 లక్షలు నాణ్యమైన ఇళ్లు కట్టగా జగన్ హయాం లో 10 శాతం కూడా ఇళ్లు పూర్తి చేయలేదు. కేంద్రం ఇచ్చిన రూ.1.80 లక్షల తోనే సరిపెట్టాడు. దానికి రాష్ట్ర నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులకు తోడు గ్రామాల్లో ఇళ్లకు రాష్ట్ర నిధుల నుండి రూ.50వేలు, పట్టణాల్లో లక్ష రూపాయలు అధనంగా ఇచ్చారు. రూ.320 ఉన్న భారతి సిమెంట్ జగన్ పాలనలో రూ.420కి పెంచారు. ఐరన్ చంద్రబాబు పాలన లో రూ.45వేలు ఉండగా, జగన్ పాలనలో రూ.68 వేలకు పెంచారు.

ఇసుక ట్రాక్టర్ రూ. 5 వేల నుండి రూ.15 వేలకు పెంచారు. ఈ రోజు చిన్న ఇల్లు కట్టాలన్నా రూ. 5 లక్షలకు తక్కువ కాదు. కేవలం కేంద్రం ఇచ్చిన 1.80 లక్షలు మాత్రమే జగన్ ఇచ్చి, రాష్ట్ర నిధుల నుండి ఏమీ ఇవ్వనందున పేదలు అప్పులు పాలయ్యారని , పైగా వారు కట్టిన కొద్దిపాటి ఇళ్లు కూడా అవినీతికి పాల్పడి నాసిరకంగా నిర్మించడం వల్ల అవి కూలి పోతున్నాయి. కాలనీలు గ్రామాల్లో, పట్టణాల్లో కలిసి పోతున్నవి. కానీ, జగన్ రెడ్డి ఊరికి, టౌన్ కు దూరంగా సెంటు పట్టాలు ఇచ్చి తిరిగి మురికి వాడు చేస్తున్నారు. ఇరుకు రోడ్లు, వేసి పేదల్ని మోసం చేశారు.‌జగన్ రెడ్డి మాత్రం 5 ప్యాలెస్ లు నిర్మించుకున్నారు. ఆయన బాత్ రూం ఉన్నంత కూడా పేదలకు ఇవ్వలేదు. టీడీపీ ఆవిర్భావం ముందు నాటి ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి 4 తడికలు, 6 వెదురు బొంగులు, 20 తాటాకు కట్టలు ఇచ్చి గుడిసలు వేయించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే పక్కాఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
    నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
  • రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

014168
Total views : 79382

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.