Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh పక్కా ఇళ్ల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేసిన జగన్…

పక్కా ఇళ్ల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేసిన జగన్…

by Prakash
జగన్

ఏడాది కి 5 లక్షల చొప్పున మొత్తం 25లక్షల ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తానని హామీ నిచ్చి సీఎం జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని మాజీ మంత్రి విజయవాడ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉచితంగా ఇవ్వకపోగా గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారని, గృహాలు‌ నిర్మించుకోక పోతే పట్టాలు రద్దు చేస్తామని బెదిరించి పేదల చేత అప్పు చేయించి ఇళ్లు కట్టించి వారికి బిల్లులు చెల్లించక అప్పుల పాలు చేశారని, ఇళ్ల పేరుతో డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి పేరుతో రూ.35 వేలు చొప్పున మొత్తం రూ.3,866 కోట్లు అప్పులు తెచ్చి మహిళల నెత్తిన వేల కోట్లు అప్పులు నెత్తిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్లు అప్పు రెండేళ్లు రుణకాల పరిమితి చెల్లించక పోవడంతో బ్యాంకులు నేరుగా లబ్దిదారులకే నోటీసులు ఇస్తున్నాయని, తెచ్చిన అప్పులు ఏమయ్యాయో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదని, ఓటిఎస్ పేరుతో ఎన్టీఆర్, చంద్రబాబు ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు బలవంతం గా రూ.10వేల నుండి రూ.30వేలు జగన్ రెడ్డి వసూలు చేశారని చెప్పారు. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని చోట్ల సెంటు పట్టా ఇచ్చారు. చంద్రబాబు 2 సెంట్లు ఇస్తే దాన్ని 1 సెంటుకు కుదించారని, రూ.7 వేల కోట్లకు పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు సెంటు పట్టాలో కుంభ కోణం చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

భారతి సిమెంటులో బూడిద కలిపి కట్టిన ఇళ్లు కూలిపోతున్నవి. చంద్రబాబు 5 ఏళ్లల్లో 12 లక్షలు నాణ్యమైన ఇళ్లు కట్టగా జగన్ హయాం లో 10 శాతం కూడా ఇళ్లు పూర్తి చేయలేదు. కేంద్రం ఇచ్చిన రూ.1.80 లక్షల తోనే సరిపెట్టాడు. దానికి రాష్ట్ర నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులకు తోడు గ్రామాల్లో ఇళ్లకు రాష్ట్ర నిధుల నుండి రూ.50వేలు, పట్టణాల్లో లక్ష రూపాయలు అధనంగా ఇచ్చారు. రూ.320 ఉన్న భారతి సిమెంట్ జగన్ పాలనలో రూ.420కి పెంచారు. ఐరన్ చంద్రబాబు పాలన లో రూ.45వేలు ఉండగా, జగన్ పాలనలో రూ.68 వేలకు పెంచారు.

ఇసుక ట్రాక్టర్ రూ. 5 వేల నుండి రూ.15 వేలకు పెంచారు. ఈ రోజు చిన్న ఇల్లు కట్టాలన్నా రూ. 5 లక్షలకు తక్కువ కాదు. కేవలం కేంద్రం ఇచ్చిన 1.80 లక్షలు మాత్రమే జగన్ ఇచ్చి, రాష్ట్ర నిధుల నుండి ఏమీ ఇవ్వనందున పేదలు అప్పులు పాలయ్యారని , పైగా వారు కట్టిన కొద్దిపాటి ఇళ్లు కూడా అవినీతికి పాల్పడి నాసిరకంగా నిర్మించడం వల్ల అవి కూలి పోతున్నాయి. కాలనీలు గ్రామాల్లో, పట్టణాల్లో కలిసి పోతున్నవి. కానీ, జగన్ రెడ్డి ఊరికి, టౌన్ కు దూరంగా సెంటు పట్టాలు ఇచ్చి తిరిగి మురికి వాడు చేస్తున్నారు. ఇరుకు రోడ్లు, వేసి పేదల్ని మోసం చేశారు.‌జగన్ రెడ్డి మాత్రం 5 ప్యాలెస్ లు నిర్మించుకున్నారు. ఆయన బాత్ రూం ఉన్నంత కూడా పేదలకు ఇవ్వలేదు. టీడీపీ ఆవిర్భావం ముందు నాటి ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి 4 తడికలు, 6 వెదురు బొంగులు, 20 తాటాకు కట్టలు ఇచ్చి గుడిసలు వేయించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే పక్కాఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  • సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
    సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
  • అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
    నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
  • ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

039493
Total views : 197148

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: