Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh చిలక జోస్యం….

చిలక జోస్యం….

by Prakash
Parrot prophecy

బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీలు చిలక జోస్యం చెప్పించారు. బాపట్ల ఐసిడిఎస్ ఆఫీస్ ముందు బైఠాయించి అంగన్వాడీలు, టీచర్లు, ఆయాల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎనిమిదో రోజు సమ్మె సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలక జోస్యం చెప్పించి అంగన్వాడీలు వినూత్న ధర్నా నిర్వహించారు. చిలక జోస్యం లో ఇకనైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని చిలక యజమానిచేత చెప్పించారు. ఈ చిలక జోస్యం కార్యక్రమాన్ని దారిన పోయే ప్రజలు, అధికారులు, స్కూలు పిల్లలు, కాలేజీ విద్యార్థులు విద్యార్ధినిలను విశేషంగా ఆకర్షించింది. ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని నినాదాలు చేసారు. అనంతరం రోడ్డుపై మోకాళ్ళ మీద కూర్చొని అంగన్వాడీలు నిరసన తెలిపారు. తల్లుల తకాల సేకరణ చేపట్టిన అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులు.

Advertisements

You may also like

Our Visitor

014090
Total views : 78948

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.