గుర్తింపు సంఘం పేరుతో ఉద్యోగాల కుంభకోణం…

A media conference organized at the Godavarikhani Press Club premises

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో గుర్తింపు సంఘం నాయకులు ఉద్యోగాల పేరుతో కుంభకోణానికి పాల్పడుతున్నారని పాలకుర్తి జడ్పీటీసీ&comma; బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు&period; ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మిక నాయకులు పరిశ్రమకు సంబంధించిన కొందరు అధికారులతో కుమ్మక్కై లక్షల కోట్ల రూపాయలు అమాయకులు&comma; రైతుల నుంచి వసూలు చేస్తూ గోల్ మాల్ చేస్తున్నారని పేర్కొన్నారు&period; గతంలో ఎరువుల కర్మాగారం విషయంలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని&comma; అలా కాకుండా ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా తీసుకొని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు&period; ఎన్టీపీసీ పరిశ్రమ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన రైతులు&comma; అర్హత కలిగిన యువకులను మోసం చేస్తూ డబ్బులు ఇచ్చిన వారికే తాత్కాలిక ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు&period; నిర్వాసితులకు ఎన్టీపీసీ యాజమాన్యం తప్పనిసరిగా ఉపాధి కల్పించాల్సి ఉండగా కార్మిక నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై నిర్వాసితుల నోట్లో మన్ను కొడుతున్నారని పేర్కొన్నారు&period; ఈ విషయంలో ఇప్పటికైనా పరిశ్రమ ఉన్నతాధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..