262
ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటుచేసి 10 గంటల నుండి శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఇదేవిధంగా ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయం, కోదండ రామస్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం, వేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు భక్తిశ్రద్ధలతోఈ ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు ఆలయాల్లో తీర్థప్రసాదాలు అందజేశారు.




Total views : 147624