నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వరుసగా సెలవులు రావడంతో భారీగా పెరిగిన భక్తుల రద్దీ పెరగడంతో క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
cvr devotional news
ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటుచేసి 10 గంటల నుండి శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఇదేవిధంగా ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయం, కోదండ రామస్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం, వేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు భక్తిశ్రద్ధలతోఈ ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు ఆలయాల్లో తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కరుణాకరరెడ్డి,ఈవో.ధర్మారెడ్డి , జై ఓ వీరబ్రహ్మం..పాల్గొన్నారు.
జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం విశిష్టతను తెలియజేశారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం కలుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా టిటిడి అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో భక్తులకు ఉత్తర మార్గంలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి సేవా సమితి జమ్మలమడుగు సభ్యులు ప్రసాద వితరణ చేశారు.
సింహపురి సీమలో, పవిత్ర పెన్నా నది తీరాన, ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు ఆలయంలో వేచి ఉన్నారు. రంగనాథుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి పర్వదినంతో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణం హరినామస్మరణతో మారుమోగింది.
శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి, అమ్మవారికి ప్రత్యేక ఉత్సవం నిర్వహించి భక్తులను ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి, అమ్మవారి దర్శనానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు, అధికారులు అనుమతిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజ అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఉత్తరద్వార ముఖమండపం నుండి వెలుపలకు తోడ్కొని వచ్చి రావణవాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు ఉత్సవ సంకల్పన్ని పఠనించి ప్రత్యేక పూజలు, అర్చనలతో హారతులిచ్చారు. అనంతరం రావణవాహనోత్సవపై క్షేత్రపురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అలానే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం ముఖమండపం వెలుపల (బలిపీఠం సమీపంలో) ఆశీనులను చేశారు. భక్తులు శ్రీస్వామి అమ్మవారిని ఉత్తరద్వారా దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు. విశేషపూజలు, గ్రామోత్సవం అనంతరం ఉదయం 6 గంటల నుండి శ్రీస్వామి అమ్మవార్ల సర్వదర్శనానికి, ఆర్జితసేవలకు భక్తులను అనుమతించారు. భక్తులు తెల్లవారుజాము నుండే క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.
Read Also..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ మాచవరం ఆంజనేయస్వామి దేవస్థానం ధ్వజ స్తంభ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో భవాని మాట్లాడుతూ గత మూడు రోజులుగా పలు విశేష పూజలు నిర్వహించి, ఈ రోజు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూజలతో భక్తులందరూ స్వామివారి నీ భారీ సంఖ్యలో దర్శించినందుకు ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Read Also..
భక్తుల నుండి అనధికారికంగా కేశఖండనశాల వద్ద ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కేశఖండన కు 40 రూపాయల టికెట్ను పెట్టగా.. ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర అదనంగా 50 రూపాయలు నుండి 100 రూపాయిల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న అడగలేని నిస్సహాయ స్థితిలో భక్తులు, పట్టించుకోని దేవాదయ శాఖ ఉన్నతాధికారులు.
వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా రంగా విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా 829197 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి కేబి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టోత్తరం ద్వారా 7400, కుంకుమార్చన ద్వారా 26320, వివాహములు ద్వారా 10000 రూపాయలు, భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా 26175 రూపాయలు, వాహన పూజల ద్వారా 2440 రూపాయలు, ప్రత్యేక దర్శనాలు ద్వారా 169200 రూపాయలు, స్థల పురాణం ద్వారా 1020 రూపాయలు, రూము అద్దెలు ద్వారా 32960 రూపాయలు, కవర్లు ద్వారా 5100, లడ్డు ప్రసాదం ద్వారా 201830 రూపాయలు, అన్నదానము ద్వారా 336252 రూపాయలు, విరాళాల ద్వారా 10500 రూపాయలు మొత్తం ఆదాయం 829197 లభించినట్లు తెలిపారు.
Read Also..
తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండడం, సీతాకాలం కావడంతో తిరుమల వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. ఓ వైపు చల్లని చలి గాలులు వీస్తున్నాయి. మరోవైపు పొగ మంచి తిరుమలను దట్టంగా కప్పేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందంగా సంతోషాన్ని నింపుతుంది. చిరుజల్లులు, పొగ మంచు, చలి ఇలా ఊటీని సైతం మించిపోయేలా ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల లో వాతావరణం ఈ విదంగా ఉండడంతో భక్తులు తన్మయంతో ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపు ఘాట్ రోడ్లలో కూడా పొగ మంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి అంటు టీటీడీ సూచన చేస్తుంది.






Total views : 91132