అనకాపల్లి జిల్లా, కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్. నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు ఛానళ్ళు రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటు ప్రచారం చేస్తున్నారు. చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని ఇలాంటి వార్తలు వల్ల నేను దిగజారిపోను. అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది అది వైసీపీ కార్యకర్త పోస్టు అది ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు. మీతో పాటు కార్యకర్త గా జెండా మోయడానికి సిద్దం ఉన్నా. వీధివీధుల్లో కార్యకర్త గా తిరుగుతా. రాష్ట్రవ్యాప్తంగా ఓ ముఠా తయారైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం అధికారం వచ్చాక కొంత మందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా మంత్రి పని చేసా అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భరత్ కు సహకరించాలి.
స్టేజీ మీదే కంటతడి పెట్టిన మంత్రి గుడివాడ అమర్ నాథ్
419
previous post





Total views : 80937