Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ధర్నాకు దిగిన ఆశా కార్యకర్తలు…

ధర్నాకు దిగిన ఆశా కార్యకర్తలు…

by Prakash
Asha Workers, ఆశా కార్యకర్తలు

Asha Workers :

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు నెలలుగా ఆశా కార్యకర్తలకు వేతనాలు ఇవ్వడం లేదని, ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలపై ఏఎన్సీ పేరుతో అధిక భారం పడే విధంగా పని ఒత్తిడి కల్పిస్తున్న అధికారులు తక్షణమే దీన్ని రద్దు చేయాలని కోరారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని పలుమార్లు అడిగినా అందించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల నిరావధిక సమ్మె చేపట్టడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలతో పాటు సిపిఐ, సిపిఎం వామపక్ష నేతలు పాల్గొన్నారు.

Read Also…

Advertisements

You may also like

Our Visitor

013928
Total views : 78469

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.