263
అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పీలేరు పట్టణ పరిసరాల్లో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణం, హెలిఫ్యాడ్ స్థల పరిశీలన, వాహనాల కోసం పార్కింగ్, బహిరంగ సభా స్థలం పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలు, నాయకులు, ప్రజలు, అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.




Total views : 77982