బెంగళూరులో నంది నోటి నుంచి నిరంతరం జలం

Nandi

Advertisements

&NewLine;<p>ఆధునిక నగరమైన బెంగళూరు నగరంలో ఆశ్చర్యపరిచే మిస్టరీలు కూడా ఉన్నాయి&period; ఇటీవల కాలంలో ఇక్కడ బయటపడిన 7వేల సంవత్సరాల నాటి నంది తీర్ధంలో నంది నోటి నుంచి నిరంతరం నీరు రావడం విశేషం&period; బెంగళూరు నగరంలో దాదాపు 7 వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం ఉంది&period; భారతదేశంలో ఇటీవల కనుగొన్న మర్మ దేవాలయాల్లో ఇది ఒకటి&period; బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది&period; ఈ దేవాలయాన్ని నంది తీర్ధ&comma; నందీశ్వర తీర్ధ&comma; బసవ తీర్ధ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తుంటారు&period; ఇక్కడ మహా శివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు&period; ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఉంటుంది&period; ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది&period; అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు వచ్చింది&period; ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత&period; దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు&period; నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళ్తుంది&period; క్షేత్రం అంటే కన్నడలో స్థలం అని అర్ధం&period; కొన్ని సందర్భాల్లో చారిత్రక&comma; మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను లేదా ప్రాంతాలను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు&period; అయితే పైన చెప్పబడిన ఈ ప్రత్యేకతలు అన్నీ కలిపి ఈ ఆలయానికి అధికారిక నామంగా మారాయి&period;<br>ఆలయం చరిత్ర&colon;<br>1997లో బెంగళూరు నగరంలోని కడు మల్లేశ్వర ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు&period; అయితే తవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఓ ఆలయం ఉన్నట్లు గుర్తించారు&period; ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ శివాలయం బయటపడినట్లు చెబుతారు&period; భారత పురాతత్వ పరిశోధన శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యలో ఉన్న కొలను&comma; గ్రానైట్ మెట్ల నిర్మాణాలను&comma; మండప స్తంభాలను కనుగొన్నారు&period; ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది&period; ఈ ఆలయ వయస్సుపై విరుద్దమైన నివేదికలు ఉన్నాయి&period; ఇది 400 సంవత్సరాల క్రితం నాటిదని కొన్ని నివేదికలు చెబితే&comma; కొన్ని ఆధారాల ప్రకారం ఇది 7000 సంవత్సరాల పూర్వందని చెబుతున్నారు&period;<br>ఎందుకంత ప్రత్యేకం&colon;<br>ఈ ఆలయంలో ప్రత్యేకమైన నంది విగ్రహాన్ని పురావస్తు పరిశోధన శాఖ వారు పరిశీలించారు&period; నంది నోటి నుంచి నిరాటంకంగా జలం రావడాన్ని గుర్తించారు&period; ఈ నీరంతా ఆలయం మధ్య భాగంలో ఉన్న కళ్యాణి అనే ప్రదేశానికి వెళ్లి శివలింగంపై పడుతున్నట్లు నిర్ధారించారు&period; అయితే నంది నోట్లో నుంచి వస్తున్న నీరు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో పరిశోధకులు కనుగొనలేకపోయారు&period; వృషభావతి నదికి దీనిని జన్మ స్థానంగా భావిస్తారు&period; చరిత్రలో నంది తీర్ధ ఆలయం చాలా కాలం వినియోగంలో లేకుండా క్రమంగా భూ గర్భంలో కలిసినట్లు చెబుతారు&period; పరిసర ప్రాంతాల్లో ఉన్న సాధారణ భూస్థాయి కంటే ఈ ఆలయం తక్కువ ఎత్తులో ఉంటుంది&period; దీనికి తోడు ఆలయంపై గోపుర శిఖరం కూడా లేకపోవడంతో ఇది కాల క్రమంలో ప్రజల దృష్టి నుంచి దూరమైనట్లు శాస్త్రవేత్తల అభిప్రాయం&period; ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలు నివసించారనడానికి&comma; ఈ ఆలయం ప్రజల నుంచి పూజలు అందుకుందని చెప్పడానికి ఆలయంలో ఉన్న కళ్యాణి ప్రదేశం ఒక జ్ఞాపకంగా&comma; చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది&period; కాలక్రమంలో బెంగళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతం నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ప్రముఖమైనదిగా అభివృద్ధి చెందింది&period; దీంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి&period; 1997లో నగరంలో కాస్త ఖాళీగా స్థలంగా ఈ ఆలయం ఉన్న ప్రదేశం కనిపించడంతో ఇక్కడ నిర్మాణాలకు పనులు మొదలయ్యాయి&period; అయితే ఈ ప్రదేశంలో పురాతన ఆలయం బయట పడడంతో స్థానికుల ఆందోళనల మేరకు దీనిని బయటకు తీసే ప్రయత్నాలు జరిగాయి&period; ఈ క్రమంలోనే మట్టి&comma; బురద నుంచి దక్షిణ ముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం బయటపడినట్లు చెబుతారు&period;<br>ఈ ఆలయం స్తంభాలతో కూడిన కళ్యాణి ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది&period; సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాల్లో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది&period; అయితే ఇక్కడ మాత్రం నంది పైన&comma; శివలింగం కింద ఉండడం విశేషం&period; శివలింగానికి ఎడమ వైపు మూలన చిన్న గణేశుని విగ్రహం ఉంటుంది&period; అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రధాన విగ్రహానికి కుడి వైపు నవగ్రహ మండపం ఉంటుంది&period; శివాలయం కావడంతో ఇక్కడ శివుడికి సంబంధించిన ప్రతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు&period; కార్తీక మాసం&comma; మహా శివరాత్రి సమయాల్లో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది&period; బెంగళూరు ప్రధాన నగరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది&period; ఉదయం 6&period;00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ&comma; సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8&period;30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది&period; ఈ ఆలయ ప్రాచుర్యం&comma; ప్రత్యేకతలు రోజురోజుకూ విస్తరించడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..