తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శృంగవరపుకోట మండలంలో చిన్నవేమల వీధి మరియు గౌరీ శంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన *బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యమక్రమానికి ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం నేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ హాజరయ్యారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మినీ మేనిఫెస్టో తో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని గొంప క్రిష్ణ తెలిపారు. అనంతరం గొంప క్రిష్ణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మాటని, ఆ మాటను పక్కన పెడితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, పాలనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మోసం చేశాడని క్రిష్ణ మండిపడ్డారు.
ఒక్క ఛాన్స్ అంటూ మోసం చేసిన జగన్….
567
previous post