ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికి మాలిన సలహాలేనని అన్నారు. సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేష్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని… అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అధికారులు నీతి, నిజాయతీతో పని చేయాలని చెప్పారు. తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.
Vizianagaram District News
విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో రానున్న ఎన్నికల దృశ్య మెంటాడ గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే ముందుగా సంత తోట నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి గజపతినగరం జనసేన నాయకురాలు పడాల అరుణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పడాల అరుణ మాట్లాడుతూ ఈ జగన్ అరాచకపాలనకు చరణగీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి జనసేన పోత్తులలో భాగంగా జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టిడిపి జనసేన పొత్తుల్లో భాగంగా ఉమ్మడి కార్యకర్తలు సఖ్యతతో పనిచేసి ఇరు పార్టీలలో ఎవరికి టికెట్ వచ్చినా విభేదాలు లేకుండా పనిచేయాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శృంగవరపుకోట మండలంలో చిన్నవేమల వీధి మరియు గౌరీ శంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన *బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యమక్రమానికి ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం నేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ హాజరయ్యారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మినీ మేనిఫెస్టో తో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని గొంప క్రిష్ణ తెలిపారు. అనంతరం గొంప క్రిష్ణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మాటని, ఆ మాటను పక్కన పెడితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, పాలనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మోసం చేశాడని క్రిష్ణ మండిపడ్డారు.






Total views : 78273