Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ..

జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ..

by Rama
Marry Prasanthi

ఈనెల 3వ తేదీన ఏలూరు నేషనల్ హైవే పక్కన ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు మూడు లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్ళిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.. అదేవిధంగా వైజాగ్ నుండి విజయవాడ చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నట్లు తెలిపారు.. వీటితోపాటు నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

039205
Total views : 194757

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: