ఈనెల 3వ తేదీన ఏలూరు నేషనల్ హైవే పక్కన ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు మూడు లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్ళిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.. అదేవిధంగా వైజాగ్ నుండి విజయవాడ చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నట్లు తెలిపారు.. వీటితోపాటు నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.
Tag:
Jagan MohanReddy
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కరించాలని వినూత్న రీతిలో మట్టిని తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మొద్దు నిద్రలో ఉందన్నారు, ఇప్పటికైనా మా సమస్యల పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు. లేకపోతే రోజు కూడా ఇలానే మట్టిని తింటూ మేము మా సమస్యల పరిష్కరించేంత వరకు కూడా పోరాడుతామని అన్నారు. పెనుకొండకు వచ్చిన శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పట్టించుకోకుండా ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు.





Total views : 78929