దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల(General Elections) రెండో దశ పోలింగ్(Second Phase is Polling) కొనసాగుతుంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని బైతూల్లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణం చెందారు. అక్కడ ఓటింగ్ను మూడో దశకు మార్చారు. రెండో విడతలో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 8.08 కోట్లు పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. మొత్తం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 లక్షలకు పైగా పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి 1,202 మంది బరిలో ఉన్నారు.
కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాల్లోనూ నేడే ఓటింగ్ పూర్తికానుంది. ఈ విడతతో రాజస్థాన్లో ఓటింగ్ పూర్తికానుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 25 ఉండగా.. 12 స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ ముగిసింది. కర్ణాటక 14, ఉత్తర్ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 6, బిహార్ 5, అస్సాం 5, పశ్చిమ బెంగాల్ 3, ఛత్తీస్గఢ్ 3, జమ్మూకశ్మీర్ 1, మణిపుర్ 1, త్రిపుర 1 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.
వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ దశలోనే బరిలో ఉన్నారు. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. హ్యాట్రిక్ విజయాల కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా..కోటా-బూందీ నుంచి, జోధ్పుర్ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బరిలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న రాజ్నంద్గావ్ స్థానంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్ బఘేల్ బరిలో దిగారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతోన్న తిరువనంతపురంలోనూ నేడే పోలింగ్ జరుగుతోంది. వీరితో పాటు బీజేపీ తరఫున మేరఠ్ అరుణ్ గోవిల్ , బెంగళూరు దక్షిణం నుంచి తేజస్వీ సూర్య బరిలో ఉన్నారు. అలప్పుళ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజే నిక్షిప్తం చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు..ఉత్తరాఖండ్(Uttarakhand) లోని బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం మంచుతో ఈ ఆలయం కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ లలో శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ…
- లోక్సభ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్..!తెలుగు రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ…
- హర్యానాలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానా (Haryana) లోని అధికార బీజేపీ (BJP) ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్సింగ్ సైనీ సారథ్యంలోని ప్రభుత్వం మైనార్టీలో పడింది. సోంబిర్ సంగ్వాన్, రణ్ధీర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.