Friday, May 22, 2026
News Navigation
Friday, May 22, 2026
News Navigation

Breaking

Friday, May 22, 2026
Home Andhra PradeshKrishana భారీ ర్యాలీతో నామినేషన్ పూర్తిచేసిన సొంగా. రోషన్ కుమార్

భారీ ర్యాలీతో నామినేషన్ పూర్తిచేసిన సొంగా. రోషన్ కుమార్

by Rama
Roshan Kumar

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగా. రోషన్ కుమార్ (Songa Roshan Kumar) చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో గల మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో గల శ్రీ రామా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి చింతలపూడి చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

నామినేషన్ తరువాత సొంగా రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ సీటు మారుస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన అన్నారు,నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారని అన్నారు.ప్రజలు నన్ను ఎమ్మెల్యే గా మరియు పుట్టా. మహేష్ యాదవ్ ను ఎంపీ గా గెలిపించాలని అన్నారు. గత 10 సంవత్సరాలుగా నా జీతంలో 10 శాతం మా ఆవిడ జీతంలో నుండి 10 శాతం ఖర్చుపెట్టి పేద ప్రజలకు సేవ చేసాను, అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను అలాగే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళతాను అని ఆయన అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..
    కార్యకర్తే పార్టీ అధినేత అనేది.. మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ…
  • గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం..
    మండు వేసవి మొదలైతే చాలు… గోదావరి ఒడ్డున ఉన్న పల్లెల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో మంచినీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు…
  • తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు ..
    విశాఖ జిల్లాలో వింత ఆచారాన్ని ఓ సామాజిక వర్గంవారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని తూచా తప్పక పాటిస్తారు. దీనినే తోడపెద్దు దినకార్యం అంటారు. పెదగంట్యాడ మండలం మొల్లివానిపాలెంలో ఉన్న యాదవుల కుటుంబీకులు తోడపెద్దును ఇంట్లో…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

015213
Total views : 81807

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.