ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగా. రోషన్ కుమార్ (Songa Roshan Kumar) చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో గల మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో గల శ్రీ రామా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి చింతలపూడి చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నామినేషన్ తరువాత సొంగా రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ సీటు మారుస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన అన్నారు,నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారని అన్నారు.ప్రజలు నన్ను ఎమ్మెల్యే గా మరియు పుట్టా. మహేష్ యాదవ్ ను ఎంపీ గా గెలిపించాలని అన్నారు. గత 10 సంవత్సరాలుగా నా జీతంలో 10 శాతం మా ఆవిడ జీతంలో నుండి 10 శాతం ఖర్చుపెట్టి పేద ప్రజలకు సేవ చేసాను, అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను అలాగే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళతాను అని ఆయన అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- పవన్ కళ్యాణ్పై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై…
- నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆమె చేస్తున్న సేవలను అభినందించిన ఎమ్మెల్యే..ఆమెకు తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు.ప్రజాస్వామ్యంలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 194194